నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ద్వారా పేద ప్రజలకు ఉచితంగా న్యాయ సేవలు అందించడానికి ఏర్పాటు చేసిన డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులకు ఒక సంవత్సరం పొడిగిస్తూ తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవ సంస్థ చైర్మన్ సునీత కుంచాల డిఫెన్స్ కౌన్సిల్ రాజ్ కుమార్, సుబేదార్ ఉదయ్, కృష్ణ, శుభం, ప్రమోద్ లకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ పేదలకు ఈ వ్యవస్థ ద్వారా ముందు ముందు ఇంకా ప్రతిష్టంగా సేవలను అందిస్తూ చట్టబద్ధంగా సాయపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ సంస్థ కార్యదర్శి పద్మావతి పాల్గొన్నారు.