. . . బాల్కొండ ఎస్సై శైలేందర్
బాల్కొండ, బతుకమ్మ :
విద్యార్థులు చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా విద్యార్థి దశ నుంచే మంచి మార్గంలో ఉంటూ దేశ అభివృద్ధికి తోడ్పడాలని బాల్కొండ ఎస్సై శైలేందర్ అన్నారు. దేశ అభివృద్ధిలో యువత పాత్ర ఎక్కువగా ఉన్నందున చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా ఉండాలని ఆయన కోరారు. బాల్కొండ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో బుధవారం మన ఊరు మన భద్రత మన బాధ్యత అనే కార్యకమం పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మురళి, అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.