భిక్కనూర్, బతుకమ్మ : మండల కేంద్రం లోని టోల్ ప్లాజా సమీపంలో మంగళవారం తెల్లవారుజామున రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి నాగ్ పూర్ వైపు డీసీఎం ముందు వెళ్తున్న లారీని ఢీ కొట్టింది. డీసీఎం డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కుపోయాడు. సమాచారం అందిన వెంటనే ఏఎస్సై జగదీశ్ ఘటనా స్థలానికి చేరుకొని టోల్ ప్లాజా సిబ్బంది సహాయంతో డ్రైవర్ ని సురక్షితంగా బయటకు తీయించారు. అనంతరం చికిత్సనిమిత్తం 108 అంబులెన్స్ లో కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు.