Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 December 2025, 1:57 pm Posted by : ramakrishna

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు శిక్ష

 భిక్కనూరు, బతుకమ్మ:  డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఒకరికి  రెండు జైలు శిక్ష విధించినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. మండలకేంద్రంలోని టోల్ ప్లాజా సమీపంలో ఎన్ హెచ్ 44 హైవే పై డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించమన్నారు. ఇందులో  పట్టుబడిన ఒకరిని  సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ టీ చంద్రశేఖర్ ఎదుట హాజరుపర్చగా.. నిందితుడికి రెండు రోజుల జైలు శిక్షతో రూ. 1000 జరిమానా విధించినట్లు ఎస్సై తెలిపారు.  మద్యం తాగి వాహనాలు  నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.