Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 October 2025, 4:54 pm Posted by : ramakrishna

దొంగతనం కేసులో ఒకరికి సంవత్సరం జైలు శిక్ష

మెండోరా, బతుకమ్మ: దొంగతనం కేసులో ఒకరికి సంవత్సరపాటు జైలు శిక్ష పడినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం మెండోరా పోలీస్ స్టేషన్ నందు మే నెలలో నమోదైన దొంగతనం కేసులో నెహ్రూ నగర్ కాలానికి కి చెందిన అడుదుకె శ్యామ్ అనే వ్యక్తి కి జేఎఫ్సీఎం  ఆర్మూర్ కోర్టు మేజిస్ట్రేట్ నెల్లి సరళ రాణి  సంవత్సరం పాటు కారాగార శిక్ష విధించి తీర్పు నీ ప్రకటించారు. ఇట్టి తీర్పు రావడానికి సహకరించిన పీపీ రామకృష్ణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్మూర్ రూరల్ శ్రీధర్ రెడ్డి మెండోరా ఎస్సై సుహాసిని, కోర్టు కానిస్టేబుల్ రాజు ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య  అభినందించారు.