బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడు మండలం తిమ్మాపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు కొమిరి సాయిలు మృతి చెందినట్లు మోర్తాడ్ ఎస్సై విక్రమ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం 20 సంవత్సరాల నుండి తిమ్మాపూర్ గ్రామంలో నివసిస్తున్న కొమిరే సాయిలు(55) ఆదివారం రాత్రి సమయంలో ఇంటికి మద్యం త్రాగివచ్చి అతని బార్య కొమిరే వెంకటమ్మ,అతని కూతురు లతలతో గోడవపడినాడని, అర్ద రాత్రి అందజ 12 గంటలకు మూత్ర విసర్జన కొరకు లేచి మద్యం మత్తులో గోడకు గుద్దుకోగా తల ఎడమ వైపుకు గాయం అవగా అతని బార్య కొమిరే వెంకటమ్మ,అతని కూతురు లతలు అతని ఇంట్లో పడుకోపెట్టి ఉదయం 4 గంటలకు లేచి చూసే వరకు కొమిరే సాయిలు చనిపోయడని. సింద్రాపూర్ బాలానగర్ గ్రామానికి చెందిన కొమిరే సాయిలు అన్న కొమిరే నడ్పీ సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.