Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 January 2026, 8:36 pm Posted by : ramakrishna

ఉరేసుకొని ఒకరు మృతి

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండల కేంద్రంలోని గంగారం తండా గ్రామానికి చెందిన
షేక్ మహబూబ్ అలీ 41 అను వ్యక్తి ఇంటిలో కుటుంబ సభ్యులు ఎవరు లేని సమయంలో మధ్యాహ్నం హాల్లో ఉన్న ఫ్యాన్ కు ఉరేసుకొని ఉన్నట్లు కుటుంబ సభ్యులు గ్రహించడంతో స్థానికుల సహాయంతో జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి హుటాహుటిన తరలించారు.డ్యూటీలో ఉన్న డాక్టర్ ఉరువేసుకున్న వ్యక్తిని చూసి మార్గమధ్యంలోనే మరణించినట్లు తెలిపారు.మృతుడు ఆటోడ్రైవర్ గా కూలీ పని చేసుకునేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు.మృతుడు గత రెండు నెలల నుంచి అనారోగ్యంతో బాధపడడంతోనే మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరు లేని ఉరి పెట్టుకున్నాడని ఎస్ఐ సందీప్ తెలిపారు.మృతుడి భార్య పీర్యదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఎస్సై సందీప్ తెలిపారు.