ప్రమాద వశత్తు చెరువులో పడి ఒకరు మృతి

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలంలోని శేట్ పల్లీ గ్రామానికి చెందిన భీమన్న (55) అనే వ్యక్తి గ్రామ ఊర చెరువులో పడి చనిపోయారని మోర్తాడ్ ఎస్సై విక్రమ్ తెలిపారు. మోర్తాడ్ ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం చెరువులోకి స్నానానికి వెళ్లి ప్రమాద వశాత్తూ చెరువులో పడి చనిపోయారని ఆయన పేర్కొన్నారు. అతని తమ్ముడు బండ్ల రాజన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలియజేశారు.