Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 April 2025, 7:23 pm Posted by : ramakrishna

డీఈఓ కార్యాలయం పైనుంచి దూకి ఒకరి ఆత్మహత్య

కరీంనగర్, బతుకమ్మ : కరీంనగర్ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం పైనుంచి దూకి ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. డీఈఓ కార్యాలయంలో కట్ట రాంపూర్ గ్రామానికి చెందిన గడప రవీంధన్ నైట్ వాచ్ మెన్ గా విధులు నిర్వహిస్తున్నారు. రవీందర్ తన కుటుంబీకులతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో ఆయన ఆఫీసుకు వచ్చి కార్యాలయంపై నుంచి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.