బతుకమ్మ, పిట్లం : ఆదివారం ఉదయం చెరువు గ్రామానికి చెందిన షేక్ ముస్తాక్ (58) కాలకృత్యాలకు గ్రామంలోని ఉర చెరువుకు వెళుతుండగా మార్గమధ్యలో మద్దెల చెరువు టు పిట్లం మెయిన్ రోడ్డు పై ఏదో గుర్తుకు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో అతనికి గాయాలు కాగా బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్లిన వెంటనే ఆసుపత్రిలో మృతి చెందాడని మృతుని భార్య అయిన షేక్ బెజన్ బి ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేశారు.