తరగతి గది పైకప్పు కూలి ఒకరికి గాయాలు
మెండోరా, బతుకమ్మ: మెండోరా మండలం దూదిగాం గ్రామంలోని ప్రభుత్వ ప్రైమరి పాఠశాల తరగతి గదిలో మాతశిశు ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆధార్ నిర్వహణ పనుల్లో ఉండగా ఒక్క సారిగా తరగతి పై కప్పు తలపై కూలటంతో నిర్వాహకుడు లక్ష్మణ్ తలకు తీవ్ర గాయమైంది. మన ఊరు మనబడిలో నిర్మించిన గదుల పై కప్పు ఇంత త్వరగా కూలడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.