ఇందల్వాయి,బతుకమ్మ
ఇందల్వాయి మండల కేంద్రంలోని రామ్ సాగర్ తాండకు చెందిన ఆజ్మీర చందర్ ( 49 ) అనే వ్యక్తి చేపల కోసం తన పొలం పక్కనే ఉన్న చెరువులోకి దిగి చేపలు పడుతుండగా అకస్మాత్తుగా చెరువులో మునిగి మరణించడం జరిగిందని ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు. మృతునికి భార్య మంగి బాయి,ఇద్దరు కుమారులు, కుతురులు ఉన్నారన్నారు. మృతుని చిన్న కుమారుడు నవీన్ పీర్యదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు.