ముగ్గురికి ఒకరోజు జైలు శిక్ష
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి వరకు షాపు షాపులు నడిపిన వ్యక్తులను న్యాయస్థానం ఒక రోజు జైలు శిక్ష విధించినట్లు ఎస్ హెచ్ ఓ బి.రఘుపతి తెలిపారు. నగరంలోని హస్మీ కాలనీలోని సవేరా హోటల్ యజమాని షేక్ అబ్బు, మహమ్మదీయ కాలనీలోని మిలన్ హోటల్ యజమాని, బోదన్ బస్టాండ్ ప్రాంతంలోని స్నూకర్ షాప్ యజమాని మహమ్మద్ షాకీర్ లకు న్యాయస్థానం ఒకరోజు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.