మద్యానికి బానిసై ఒకరి ఆత్మహత్య

ఎల్లారెడ్డి, బతుకమ్మ : మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన బోండ్ల నర్సింలు(35)కు సవిత తో 12 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు కొడుకులు సంతానం. నర్సింలు  గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసై ఏ పని చేయకుండా తిరుగుతున్నాడు. బుధవారం ఉదయం నర్సింలు భార్య సవిత తమ గ్రామానికి చెందిన వారి వివాహం ఎల్లారెడ్డిలో ఉండడంతో తన పిల్లలని తీసుకొని వివాహానికి వెళ్ళింది....