Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 November 2024, 1:18 pm Posted by : ramakrishna

ఏటీఎం చోరీ కేసులో ఒకరి అరెస్ట్

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నగరంలోని అర్సపల్లి ఎస్ బీ ఐ ఏటీఎంను ధ్వంసం చేసి చోరీకి యత్నించిన వ్యక్తిని ఒకటో టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 2వ తేదీన అర్ధరాత్రి ప్రిన్స్ హోటల్ సమీపంలో ఉన్న ఎస్ బీఐ ఏటీఎంలోకి చొరబడిన వ్యక్తి ఏటీఎంను ధ్వంసం చేసి దొంగతనానికి యత్నించాడు. సమాచారం అందుకున్న పెట్రోలింగ్ కానిస్టేబుళ్లు అశోక్, నారాయణ గాలింపు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చోరీకి యత్నించిన వ్యక్తిని అమ్దాపూర్ గ్రామానికి చెందిన సంతోష్ గా గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్త చేస్తున్నారు.

One arrested in ATM theft case