- రిమాండ్ కు తరలింపు
ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న బండలింగంపల్లి గ్రామానికి చెందిన గూడూరి మనోహర్ ను అరెస్టు చేసి ఇసుక ట్రాక్టర్ ని పట్టుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపిన ఎల్లారెడ్డిపేట ఎస్సై కె.రాహుల్ రెడ్డి. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ డ్రైవర్, ఓనర్ అయిన గూడూరి మనోహర్ ను అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా మేజిస్ట్రేట్ 14 రోజుల జ్యూడిషల్ రిమాండ్ కు పంపినట్లు వెల్లడించారు. ఎవరైనా ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేసినట్లయితే వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై కే రాహుల్ రెడ్డి హెచ్చరించారు.