కామారెడ్డి, బతుకమ్మ :
మా భూమిలో సర్వే చేయాలని నాలుగు సార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదని భవాని పేట గ్రామని కి చెందిన రైతు గంగని చిన్న నర్సింలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలోని భవానిపేట గ్రామ శివారులో సర్వే నెంబర్ 841/23లో తనకి 2 ఎకరాల 37 గుంటల భూమి ఉందని, సర్వే చేయాలని పాల్వంచ మీ సేవ కేంద్రాల్లో రెండు సార్లు ఛలాన్ కట్టినా, పాల్వంచ సర్వేయర్ ఆ భూమిలో ఇప్పటివరకు సర్వే చేయడం లేదని అన్నారు. ఈ విషయం పైన జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో నాలుగు సార్లు ఫిర్యాదు చేశానని, సోమవారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ సానుకూలంగా స్పందించారన్నారు. జిల్లా సర్వేయర్ ను పిలిపించి రెండు రోజులలో సర్వే చేయాలని ఆదేశించారని తెలిపారు.