ప్రభాకర్ రావు ల్యాప్ ట్యాప్, ఫోన్లను ఎఫ్ఎస్ఎల్ కు పంపిన అధికారులు

14న మరోసారి విచారణకు రావాలని సిట్ ఆదేశం హైదరాబాద్, బతుకమ్మ : ఫోన్ టాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈనెల 14న విచారణకు రావాలని ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ ఆదేశించింది. సాక్షుల వాంగ్మూలం ఆధారంగా మరోసారి ప్రశ్నించనుంది. గతంలో ప్రభాకర్ రావు ల్యాప్ టాప్, సెల్ ఫోన్ సీజ్ చేసిన అధికారులు వాటిని  ఎఫ్ ఎస్ ఎల్ కు పంపించారు. ఈనివేదిక ఆధారంగా మరోసారి ప్రశ్నించనున్నారు.