Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 July 2026, 5:18 pm Posted by : ramakrishna

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

 

. . . నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలో గత రెండు రోజులుగా వర్షాలు ప్రారంభమయ్యాయని, కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది నగరవాసులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ప్రధానంగా శానిటేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు డ్రైనేజీలను శుభ్ర పరచాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిండకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉన్నతాధికారులతో పాటు సంబంధిత విభాగాధిపతులు సిబ్బందితో సమాచారం తెలుసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పారు. నాలాలు సరిగా లేనిచోట ముంపు సమస్య తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో వర్షపు నీరు చేరి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. అధిక వర్షపాతం నమోదైనప్పుడు నాలాలు వెంటనే శుభ్రం చేయాలన్నారు. నీరు నిండిన చోట తోడేందుకు భారీ మోటార్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అవసరమైతే ప్రత్యేక బృందాన్ని సిద్ధంగా ఉంచాలన్నారు.