Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 September 2024, 4:59 pm Posted by : ramakrishna

అలీసాగర్ రిజర్వాయర్ గేటు ఎత్తిన అధికారులు

  •  600 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల

బతుకమ్మ, బోధన్ : రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వరహలకు ఎడపల్లి మండలం అలీసాగర్ రిజర్వాయర్ లోకి 1400 క్యూసెక్కుల భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అలీసాగర్ జలాశయ నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది, దీంతో జలాశయంలోకి నీటి ఇన్ ఫ్లో పెరగడంతో అధికారులు అప్రమత్తమై అలీ సాగర్ జలాశయం ఒక గేటును సోమవారం ఎత్తివేసి 600 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు బ్రాహ్మణపల్లి చెరువులోకి చేరి అటు నుండి రెంజల్ మండలం లోని మొండి వాగు ద్వారా గోదావరి నదిలోకి వెళుతుందని ఇరిగేషన్ డీఈ లోక్య నాయక్ తెలిపారు. వరద నీటి ఇన్ ఫ్లో ఉన్నంత వరకు గేట్లను ఎత్తివేసి ఉంటాయని ఇన్ ఫ్లో తగ్గిన తర్వాత రెండు గేట్లని మూసివేస్తామన్నారు.