బాల్కొండ, బతుకమ్మ :
గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సాధారణ పరిశీలకులు జీ.వి.శ్యాంప్రసాద్ లాల్ పరిశీలించారు. అబ్జర్వర్ శ్యాంప్రసాద్ లాల్ శుక్రవారం బాల్కొండ గ్రామ పంచాయతీ పర్యటించి ఎన్నికల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్నికల అధికారులకు పలు అంశాలపై సూచనలు చేశారు. ఆయన వెంట తాసిల్దార్ ఎంపీడీవో ఎంపీ ఓ పంచాయతీ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు.