నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా కు ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రత్యేకంగా చర్యలు చేపట్టిందని ఎస్ఈ.రవీందర్ అన్నారు. దీనిలో భాగంగా శుక్రవారం 33 కెవి సంగం సబ్ స్టేషన్ కు ప్రస్తుతం 33 కెవి చిన్నపెంట ఫీడర్ నుంచి విద్యుత్ సరఫరా అందజేశామని తెలిపారు. 33 కెవి రుద్రూర్ ఫీడర్ నుండి సంఘం సబ్స్టేషన్ వరకు 3.5 కిలోమీటర్ల లైన్తో ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా చేయడానికి అనుసంధానం చేశామన్నారు. 33 కేవి రుద్రూర్ ఫీడర్ 30 లక్షల వ్యయంతో నిర్మించామని తెలిపారు. రుద్రూరు ఫీడర్ ఏర్పాటు చేయడంతో రెండు 132 కె వి సబ్స్టేషన్ల నుండి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు 132 కెవి జాకోర, కోటగిరి సబ్ స్టేషన్ల నుండి విద్యుత్ సరఫరా తీసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఇ టెక్నికల్ ఏ రమేష్, డిఈ ఆపరేషన్ బోధన్ ఎండి ముక్తార్, డి ఈ కన్స్ట్రక్షన్ డి వెంకటరమణ, ఎడి ఈ ఆపరేషన్ కే నగేష్ కుమార్, ఎడి ఈ కన్స్ట్రక్షన్ తోట రాజశేఖర్, ఏ ఈ రూరల్ బోధన్ మారుతి జె, ఏఈ కన్స్ట్రక్షన్ బోధన్ శ్రీమతి ఆర్ సుమిత, ఎస్ ఎల్ ఐ డి సి రాజు, ఎల్ఐ శివప్రసాద్, స్థానిక సిబ్బంది పాల్గొన్నారు.
