Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 July 2025, 6:15 pm Posted by : ramakrishna

ఆరె కటిక సంఘం జిల్లా అధ్యక్షునిగా న్యామతాబాద్ రవీందర్

నిజామాబాద్ సిటి, బతుకమ్మ : ఆరె కటిక సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నికలు నగర సంఘంలో ఓటింగ్ పద్ధతి ప్రకారం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో జిల్లాలోని అన్ని మండలాల నుండి ఓటర్లు వచ్చి వారి యొక్క ఓట్లను సద్వినియోగం చేసుకోవడం జరిగింది. మొత్తం 121 ఓట్లకు గాను 119ఓట్లు పోలయ్యాయి. న్యామ్ తాబాద్ రవీందర్ ప్యానెల్ కు 79 ఓట్లు రాగా, మోహన్ ప్యానల్ సభ్యులకు 40 ఓట్లు వచ్చాయి. 39 ఓట్ల మెజార్టీతో అధ్యక్షులుగా న్యాయంతాబాద్ రవీందర్, ప్రధాన కార్యదర్శిగా మిర్యాల్ కార్ మోహన్, కోశాధికారిగా వాంకర్ శ్రీనివాస్ గెలుపొందినట్లు ఎన్నికల అధికారి హుస్సేన్ అధికారికంగా ప్రకటించడం జరిగింది.