Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 November 2024, 5:54 pm Posted by : ramakrishna

తెయూ వీసీని కలిసిన ఎన్ఎస్యూఐ నాయకులు

డిచ్ పల్లి, బతుకమ్మ : ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 9 విశ్వవిద్యాలయాలకు నూతనంగా ఉప కులపతులను నియమించిన విషయం విదితమే. ఇందులో భాగంగానే తెలంగాణ విశ్వవిద్యాలయానికి నూతనంగా నియమితులైన వైస్ ఛాన్సలర్ ఆచార్య టీ.యాదగిరి రావును ఎన్ఎస్యూఐ వర్శిటీ అధ్యక్షుడు బానోత్ సాగర్ నాయక్ నేతృత్వంలో నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం యూనివర్శిటీ లో నెలకొనియున్న పలు సమస్యలను గురించి వీసికి వివరించారు. అటు ప్రధాన సమస్యలైనా నూతన బాలికల వసతి గృహం, ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు తో పాటు తదితర సమస్యలను వీసికి దృష్టికి తీసుకెళ్లారు. యూనివర్సిటీని అభివృద్ధి బాటలో నడిపించాలని కోరారు. ఈ మేరకు వీసి సానుకూలంగా స్పందించారని సాగర్ నాయక్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఉపాధ్యక్షులు భూక్యా హరీష్ ,మహేష్ ప్రధాన కార్యదర్శులు జనార్ధన్ నవీన్ ,శ్రీకాంత్, శివప్రసాద్ ,లక్ష్మణ్ , యుగేందర్ ,శివ ,విజయ్ తదితరులు పాల్గొన్నారు.