నోషనల్ సీనియారిటీ ఇవ్వాలి

నిజామాబాద్, బతుకమ్మ: హై కోర్టు తీర్పు ప్రకారం నోషనల్ సీనియారిటీ ఇవ్వాలని ప్రభుత్వ విద్యాశాఖ సలహాదారు కే కేశవరావును పదోన్నతి పొందిన స్కూల్ అసిస్టెంట్లు కోరారు. సోమవారం కేశవరావును మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు. 2002లో పదోన్నతి పొందిన స్కూల్ అసిస్టెంట్లకు అదే ఏడాది అక్టోబర్ 16 నుంచి నోషనల్ సీనియారిటీ ఇవ్వాలని కోరారు. సీఎం, సీఎస్ తో మాట్లాడి న్యాయం చేస్తామని ఈ సందర్భంగా కేశవరావు హామీ ఇచ్చారు. టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెనిగళ్ల సురేశ్, భౌతిక శాస్ర్త ఫోరం అధ్యక్షుడు...