రెండో విడత నామినేషన్ల నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. శనివారంతో తొలివిడత నామినేషన్లకు గడువు ముగిసింది. రెండో విడత నామినేషన్ల కోసం ఆదివారం ఉదయం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో రెండో విడత నామినేషన్లు ప్రారంభమయ్యాయి. రెండో విడతలో 31 జిల్లాల్లో 193 మండలాల్లో 4333 సర్పంచ్ స్థానాలకు 38,350 వార్డు సభ్యుల స్థానాలకు డిసెంబర్ 14న ఎన్నికలు జరగనున్నాయి.