బతుకమ్మ, బోధన్ : దీపావళి పండుగ సందర్బంగా బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో టపాసుల దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలనుకునే వ్యాపారులు ముందుగా పోలీసు శాఖ నుండి అనుమతి తప్పనిసరిగా పొందాలని బోధన్ సీఐ వెంకట్ నారాయణ తెలియజేశారు. టపాసుల విక్రయం కోసం దరఖాస్తు చేస్తున్న దుకాణ యజమానులు తప్పనిసరిగా ఏసీపీ బోధన్ నుండి ఎన్ఓసీ పొందిన తర్వాత మాత్రమే విక్రయాలు ప్రారంభించాలి అని సూచించారు. అనుమతి లేకుండా టపాసుల విక్రయం చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.