. . . పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగియనున్న నేపథ్యంలో, ఎన్నికల ప్రచారం నిమిత్తం బయటి ప్రాంతాల నుంచి వచ్చిన రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రచార సిబ్బంది, ఇతరులు అందరూ తప్పనిసరిగా సాయంత్రం 5.00 గంటల లోపు తమ తమ గమ్యస్థానాలకు వెళ్లిపోవాలని నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య తెలియజేశారు. నిర్దేశిత సమయం అనంతరం కమిషనరేట్ పరిధిలో అనవసరంగా సంచరిస్తున్నట్లు గుర్తించినట్లయితే, సంబంధిత వ్యక్తులపై ఎన్నికల నిబంధనలు, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రజలు, రాజకీయ పార్టీలు పోలీస్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు.