Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 February 2026, 10:37 am Posted by : ramakrishna

ఎవరు కూడా శిశుమందిర్ దగ్గరకు రావొద్దు 

 

. . . బీజేపీ కార్యకర్తలకు కామారెడ్డి ఎమ్మెల్యే విజ్ఞప్తి

 

 కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన సవాల్ కు బిజెపి కార్యకర్తలు స్పందించవద్దని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కోరారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శిశు మందిర్ వద్ద చర్చకు సవాల్ విసిరారని అక్కడికి బిజెపి కార్యకర్తలు ఎవరు రావద్దని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండండి ఇది పార్టీ సమస్య కాదని తెలిపారు. ఇది నా కుటుంబం మీద చేసిన ఆరోపణ నిరూపించు కోవలసింది నేను అని తెలిపారు. కాబట్టి కార్యకర్తలు ఎవరు పాల్గొనద్దు అని కోరారు.నేను పోలీసులకు మాట ఇచ్చిన నా మాటకు విలువ ఇచ్చి రావద్దని శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి కోరారు.