ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదు : హరగోపాల్

వెబ్ న్యూస్, బతుకమ్మ :  రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదని  ప్రొఫెసర్ హరగోపాల్ వ్యాఖ్యనించారు.  కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యల్ని ఆయన  ఖండించారు.  బండి సంజయ్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.  కేంద్ర మంత్రి హోదాలో ఉంటూ అర్బన్ మావోయిస్టులని తమపై ముద్ర వేయడం సరికాదన్నారు.  సంజయ్ వెనుక రాజ్యాంగం, ప్రభుత్వం ఉన్నాయని మర్చిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు.  తాము ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదని హర గోపాల్ స్పష్టం చేశారు.