బీసీలను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కామారెడ్డి, బతుకమ్మ : ఏళ్లుగా బీసీల సమస్యలను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. జిల్లా కేంద్రదంలోని కళాభారతి ఆడిటోరియంలో శనివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో కులగణనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో ఈ నెల 6నుంచి చేపట్టబోయే కులగణన చరిత్ర తిరగరాస్తుందని అన్నారు. తెలంగాణను మోడల్ గా తీసుకుని జనవరి నుంచి కేంద్రం సెన్సెస్ ను చేపట్టాలన్నారు. కేసీఆర్ హయాంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఎక్కడ...