Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 September 2024, 1:51 pm Posted by : ramakrishna

నిజాంసాగర్ పీఎస్ ఆకస్మిక తనిఖీ

నిజాంసాగర్, బతుకమ్మ: మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను ఎస్పీ సింధూశర్మ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులను పరిశీలించారు. నైట్ పెట్రోలింగ్ ముమ్మరంచేయాలని, చోరీలను నివారించాలని ఎస్సై సుధాకర్, సిబ్బందికి సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ సత్యనారాయణ ఉన్నారు.