నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి విడుదల
నిజాంసాగర్, బతుకమ్మ : నిజాంసాగర్ ఎగువ ప్రాతంలో ప్రాజెక్ట్ కు ఇన్ ఫ్లో కారణంగా అత్యవసర పరిస్థితుల దృష్ట్యా నిజాంసాగర్ వరద గేట్లు ద్వార 8,000 క్యూసెక్కులకు నీటివిడుదల చేయటం జరుగుతుందని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. నిజాంసాగర్ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాజెక్టులోకి 1751 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉందని తెలిపారు. ప్రాజెక్టు సామర్థ్యం 17.802 టీఎంసీలకు గాను ప్రస్తుతం 17.773 టీఎంసీల నీరు నిలువ ఉందని తెలిపారు.