Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 February 2026, 5:56 pm Posted by : ramakrishna

రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ డేలో ప్రతిభ చాటిన నిజామాబాద్ విద్యార్థులు

 

. . . మార్చ్ ఫాస్ట్ లో ప్రథమ బహుమతి

 

. . . అభినందించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు రాష్ట్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ లోని దోమలగూడలో గల ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ డేలో నిజామాబాద్ జిల్లా చిన్నారులు తమ ప్రతిభను చాటుకున్నారు. స్పోర్ట్స్ డే మార్చ్ ఫాస్ట్ లో అగ్రస్థానంలో నిలిచి మొదటి బహుమతిని దక్కించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి చిన్నారులకు అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ డే లో పాల్గొనేందుకు  నిజామాబాద్ జిల్లా నుండి తరలివెళ్లిన 35 మంది ప్రత్యేక అవసరాలు కలిగిన బాలబాలికలు మార్చ్ ఫాస్ట్ లో ప్రతిభను ప్రదర్శించి ప్రథమ బహుమతి దక్కించుకోవడం ఎంతో గొప్ప విషయం అని, జిల్లాకు ఇది గర్వకారణం అని కలెక్టర్ హర్షం వెలిబుచ్చారు.

 

Nizamabad students excel in state-level sports day