Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 July 2025, 6:36 pm Posted by : ramakrishna

హైదరాబాద్ తరలిన నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ శ్రేణులు

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :  జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో జరిగే కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి  నిజాంబాద్ రూరల్ నియోజకవర్గం  అన్ని మండలాల నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సభకు భారీ ఎత్తున తరలి వెళ్లారు. ఈ సభకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ కార్గే హాజరవుతున్న సందర్భంగా నిజాంబాద్ రూరల్ నియోజవర్గం ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆదేశాల మేరకు ప్రతి మండలం నుండి సుమారు 2000 మంది సభకు తరలి వెళ్ళారు. సభకు వెళ్ళిన వారిలో వివిధ మండలాల అధ్యక్షులు , కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూత్ స్థాయి సభ్యులు, గ్రామ శాఖ అధ్యక్షులు, భారీ సంఖ్య లో  కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు.

Nizamabad Rural Congress ranks move to Hyderabad