Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 August 2025, 5:26 pm Posted by : ramakrishna

25న నిజామాబాద్ డివిజన్ మహాసభ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఈనెల 25న (సోమవారం) తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ డివిజన్ మహాసభ నిర్వహిస్తున్నట్లు సభ్యులు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని కూడా ఎన్నుకుంటున్నట్లు తెలిపారు.  ఈ మహాసభకు రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ జనరల్ గడ్డం అశోక్ హాజరవుతారని పేర్కొన్నారు. ముఖ్యమైన పెన్షనర్ల సమస్యల గురించి చర్చించటం జరుగుతుందన్నారు. జిల్లా అధ్యక్షులు రామ్మోహన్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ వి ఎల్ నారాయణ, ప్రధాన కార్యదర్శి మదన్ మోహన్ హాజరవుతారని తెలిపారు. విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కే రామ్మోహన్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఈవిల్ నారాయణ, జిల్లా నాయకులు పురుషోత్తం అమీదుద్దీన్ ఘంటా నరేందర్, శిల్ప లింగయ్య. బాల దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.