నిజామాబాద్, బతుకమ్మ:
నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ జనరల్ ఆసుపత్రి సూపరింటేండేంట్ గా ఫ్రో. డాక్టర్ శ్రీనివాస్ నియమితులు అయ్యారు. ఈ మేరకు వైధ్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సేక్రేటరీక్రిస్టినా జడ్ చోంగ్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రికి రెగ్యూలర్ సూపరింటేండేంట్ లేక పోవడం ఇంచార్జీగా ప్రో.డాక్టర్ ప్రతిమా రాజ్ నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు.ప్రతిమా రాజ్ తరుచు వివాదాల చుట్టుముట్టడంతో ఆమేను తప్పించి హైద్రాబాద్ లో పనిచేస్తున్న పిల్లలవైధ్య నిపుణులు ఫ్రోపేసర్ పి. శ్రీనివాస్ ను ఇంచార్జీ సూపరింటేండేంట్ గా నియమించారు. రెపో మాపో శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. మూడు రోజుల క్రితం ఆసుపత్రిలో డాక్టర్ ప్రతిమా రాజ్ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించుకోవడం వివాధస్పధంగా మారింది.
