హైకోర్టులో ప్రమాణ స్వీకారం చేసిన కొత్త జడ్జిలు
హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ హైకోర్టుకు కొత్తగా వచ్చిన నలుగురు అదనపు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం గురువారం హైకోర్టులో జరిగింది. జస్టిస్ గౌస్ మీరా మొహినుద్దీన్, జస్టిస్ సుద్దాల చలపతిరావు, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్ లతో సీజే జస్టిస్ అపరేషన్ కుమార్ సింగ్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.