మాక్లూర్, బతుకమ్మ : నిజామాబాద్ అర్బన్ మాజీ శాసనసభ్యులు బిగాల గణేష్ గుప్తా, ఆయన సోదరులు బిగాల మహేష్ గుప్తా తండ్రి బిగాల కృష్ణమూర్తి స్మారకార్థం మాక్లూర్ మండల కేంద్రంలో నిర్మించిన బిగాల గంగారం మండల పరిషత్ పాఠశాల నూతన భవనాన్ని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, రాజ్య సభ సభ్యులు కే.ఆర్.సురేష్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ భవనాన్ని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ రూ.కోటి తన స్వంత నిధులు, విద్యాశాఖ నిధులు రూ.5.70కోట్లతో నిర్మించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు, నిజామాబాద్ మాజీ మేయర్ నితుప్రసాద్, , జిల్లాపరిషత్ మాజీ ఛైర్మన్ విఠల్ రావు,ఇతర ప్రజాప్రతినిధులు,అధికారులు పాల్గొన్నారు.

