- తరలిరావాలని ఆర్మూర్ జెఏసి పిలుపు
ఇందూర్, బతుకమ్మ: దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా 9 వ తేదీన ఉద్యోగులందరు ధర్నా, నిరసన కార్యక్రమల్లో పాల్గొనాలని తెలంగాణ పవర్ జెఏసి ఆర్మూర్ డివిజన్ పిలుపునిచ్చింది. జెఏసి చైర్మన్ నరేందర్ నాయక్, కన్వీనర్ సల్ల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎన్సిసిఓఈఈఈ పిలుపు మేరకు టీజీపీజేఏసీ ఆధ్వర్యంలోవిద్యుత్ ఉద్యోగులందరు తరలి రావాలని కోరారు. జెన్, ట్రాన్స్కో, డిస్కం లలోని డివిజన్, సర్కిల్ కార్యాలయాల ఎదుట విధులను బహిష్కరించి భోజన విరామ సమయంలో నిరసనలు కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో ట్రేడ్ యూనియన్ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.