ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   జి.జి. కళాశాల రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో శనివారం "జాతీయ ఓటర్ల దినోత్సవం" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ డా.పి. రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ 18 సం.రాలు నిండిన ప్రతి వ్యక్తి ఓటు నమోదు చేసుకోవాలని, ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆత్మ ఓటులో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డా.ఎస్.రంగరత్నం, దండు స్వామి, అనసూయ, రామస్వామి, రమేష్ గౌడ్, చాంద్ పాషా, రాహుల్, నరేందర్, శ్రీనివాస్, సురేఖ, పూర్ణచందర్ రావు, కార్యాలయ సిబ్బంది రామ్ కిషన్,...