29న జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ఆవిష్కరణ

నిజామాబాద్, బతుకమ్మ : ఈ నెల 29న  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిజామాబాద్ నగరంలో నిర్మితమైన జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా జరుగనున్న కార్యక్రమానికి ముందుగా, వాణిజ్య శాఖ జాయింట్ సెక్రటరీ కేసాంగ్ షెర్పా, బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, సెక్రటరీ భవాని శ్రీ కలిసి కొత్త  కార్యాలయ ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాట్లను సమీక్షించారు.