బతుకమ్మ, ఏర్గట్ల : జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్గట్ల ఉన్నత పాఠశాలలో సైన్స్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు సైన్స్ మీద అవగాహన కోసం వారికి ప్రత్యేకంగా వ్యాసరచన పోటీలు ఉపన్యాస పోటీలు క్విజ్ పోటీలు నిర్వహించారు. అదేవిధంగా విద్యార్థులు తయారుచేసిన సైన్స్ ప్రయోగాలను కూడా ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు మునిరుద్దీన్ మాట్లాడుతూ మనిషికి సైన్స్ కి అవినాభావ సంబంధం ఉందని ఉదయం నుండి రాత్రి పడుకునే వరకు సైన్స్ తోని మన జీవితం గడుస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా పోటీలలో గెలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ప్రసాద్ ,పవన్, శ్రీనివాస్, రాజనర్సయ్య, రాజేందర్, ప్రవీణ్ శర్మ, గంగాధర్, నరేష్, గంగా మోహన్, ట్వింకిల్, జ్యోతి, సమత పాల్గొన్నారు.