బతుకమ్మ భిక్కనూరు: రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరు పాటించాలని అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బిక్షపతి అన్నారు. జాతీయ భద్రత దినోత్సవం భాగంలో టోల్ ప్లాజా సమీపంలో ప్రతి వాహనదారుడు సీట్ బెల్ట్ ధరించి మరియు వాహనానికి చుట్టుపక్కల రేడియం స్టిక్కర్లను అతికించాలన్నారు. రహదారిపై వాహనాలు నడిపేటప్పుడు సెల్ ఫోన్ వాడరాదు అన్నారు. ఈ కార్యక్రమంలో హోంగార్డు అశోక్ సిబ్బంది పాల్గొన్నారు.
