Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 August 2024, 6:21 pm Posted by : ramakrishna

రవి పబ్లిక్ స్కూల్లో జాతీయస్థాయి క్రీడలు

బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భారత్ క్రీడా ప్రాధికార సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న జాతీయస్థాయి ఖేలో ఇండియా రైసింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ కార్యక్రమం రవి పాఠశాలలో నిర్వహించారని పాఠశాల కరస్పాండెంట్ సరళ మహేందర్ రెడ్డి తెలిపారు. వారు మాట్లాడుతూ ఖేలో ఇండియా ప్రోగ్రాం మా పాఠశాలలకు అవకాశం రావడం చాలా అదృష్టం గా భావిస్తున్నామన్నారు.

రానున్న రోజుల్లో ఒలంపిక్స్ దృష్ట్య కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థులకు వారి ప్రతిభ కనబరచటానికి మంచి అవకాశం అన్ని అన్నారు. ఈ ఎంపికలు నిర్వహించడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి బృందం స్పోర్ట్స్ అథారిటి కబడ్డీ కోచ్ శ్రీనివాస్ రావు, అథ్లెటిక్స్ కోచ్ సుబ్బారావు పర్యవేక్షణలో నిర్వహించారు.
సుమారు 100 పైగా విద్యార్థులకు ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రెటరీ శ్యామ్, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

National level sports at Ravi Public School