Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 February 2025, 1:55 pm Posted by : ramakrishna

నరేందర్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలి

బోధన్, బతుకమ్మ: పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కోరారు. పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ లో వివిధ విద్యాసంస్థల పట్టాభద్రులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. సుస్థిర ప్రభుత్వానికి చేయూతనిల్వాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడంతోపాటు రానున్న స్థానిక ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, పట్టణ నాయకులు, పలు విద్యాసంస్థల చైర్మన్లు, పట్టభద్రులు పాల్గొన్నారు.

Narendra Reddy should win with a big majority