హైదరాబాద్, బతుకమ్మ : మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో ఈ నెల 21లోపు క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, నటి సమంత విడాకుల వ్యవహారంలో కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.