మోర్తాడ్, బతుకమ్మ : నాగుల పంచమి పండుగను పురస్కరించుకొని భక్తులు భక్తిశ్రద్ధలతో పండుగ రోజున వేద పండితులు ప్రదీప్ శర్మ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేంద్రునికి పాలాభిషేకాలు నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్న పెద్ద అందరు కలిసి ప్రత్యేకంగా అలంకరించుకొని పూజ సామాగ్రితో గ్రామాల్లో ఉన్న పుట్టల దగ్గరికి వెళ్లి పాలు పోసి చల్లంగా చూడమని పాడి పంటలు సమృద్ధిగా పండాలని వర్షాలు కురవాలని దేవాలయాల్లో పూజలు నిర్వహించారు.