రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన మంగళి పెంట గంగాధర్ ఆదివారం తమ గోడును మీడియా ముందు విన్నవించారు. బోనాల పండుగ సందర్బంగా మా కులానికి చెందిన మంగళి లక్ష్మణ్ అనే వ్యక్తి కులంలో మద్యం పంచె విషయంలో నాపై సుమారు పది మంది వరకు దాడి చేశారని బాధితుడు ఆరోపించారు. మా కులంలో పెత్తనం చెలాయించి నా పై తరచూ గొడవలకు దారి తీస్తాడని అన్నారు. తమకు దాడి చేయడంతో ఈ విషయం పై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. తమకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని భాధితుడు కోరారు.