Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 September 2024, 1:00 pm Posted by : ramakrishna

బీజేపీ ఎస్సీ మోర్చా నాయకుల పరస్పర ఫిర్యాదులు

. నచ్చజెప్పిన ఎమ్మెల్యే ధన్ పాల్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:  భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శివకుమార్ ఒంటెద్దు పోకడలకు పోతున్నారని, తమను అవమానిస్తున్నారని ఎస్సీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణకు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొనకుండా కార్పొరేటర్లు నిరసన తెలిపారు. ఎమ్మెల్యే ధన్ పాల్ కల్పించుకొని రెండు వర్గాలకు నచ్చజెప్పారు. సొంత పార్టీలోనే ఎస్సీ మోర్చా అధ్యక్షుడు ఇలా తమను అవమానిస్తే తాము ఏ విధంగా పనిచేయాలని కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు.